కరీంనగర్ లో కిడ్నాప్ కలకలం.. అర్ధరాత్రి కిడ్నాప్ ని చేదించిన పోలీసులు

-

కరీంనగర్ జిల్లాలో చిన్నారి కిడ్నాప్ స్థానికంగా కలకలం రేపింది. రాత్రి 7 గంటల సమయంలో వీక్ లీ మార్కెట్ వద్ద రెండు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేశాడు ఆటో డ్రైవర్. పాపను ఖాజీపూర్ లో దాచాడు నిందితుడైన ఆటో డ్రైవర్. పాప కనిపించకపోవడంతో స్థానిక యువకులు చిన్నారి కోసం గాలించారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పాప తల్లిదండ్రులు.

రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఆటో డ్రైవర్ ని, కిడ్నాప్ అయిన పాపను సుభాష్ నగర్ లో గుర్తించారు పోలీసులు. ఆరు గంటల వ్యవధిలో కిడ్నాప్ అయిన పాపను కిడ్నాపర్ చెర నుండి విడిపించి తల్లిదండ్రులకు అప్పజెప్పారు పోలీసులు. దీంతో ఏసిపి తుల శ్రీనివాసరావు, సీఐలు నటేష్, దామోదర్ లపై ప్రశంసలు కురిపించారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news