టిఆర్ఎస్ జెండా కింద ఉన్నవాళ్లంతా..తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే – కిషన్‌ రెడ్డి

-

టిఆర్ఎస్ జెండా కింద ఉన్నవాళ్లంతా..తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లేనని కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని.. అన్యాయాలు చేయడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి రివాజు గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అబద్దానికి పెద్ద బిడ్డ టిఆర్ఎస్.. కేసీఆర్ వచ్చే జన్మలో కేంద్ర రాజకీయాల గురించి ఆలోచించు అని చురకలు అంటించారు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉందా ? దళిత బంధు తో పాటు గిరిజన, బీసీ బంధు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

నెలలో 20 రోజులు ఫార్మ్ హౌస్ లోనే ఉంటారు .. ప్రగతి భవన్ లో 10 రోజులు ఉంటే 8 రోజులు మోడీ నే తిడతారని ఫైర్ అయ్యారు. ప్రజలను కేసీఆర్ కలవరు. కేంద్రం పై కుట్రలు చేయడానికి టైం ఉంటుంది.. ప్రజలను కలవడానికి టైమ్ ఉండదని చురకలు అంటించారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రగతి భవన్ నుంచి ఎందుకు గెంటేశావ్ అని కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news