కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతుకు రైతుబంధు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

కాంగ్రెస్ నేత, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కౌలు రైతుల రైతుబంధు, రుణమాఫీ ఇస్తామని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో ఎక్కడైనా కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తారని కోమటి రెడ్డి అన్నారు. భూ స్వాములు, ఉద్యోగులు, వ్యాపారులు ఎవ్వరూ వ్యవసాయం చేయరని… పేదవారు వారి భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తారని అన్నారు. ఏదైనా నష్టం వస్తే ఆత్మహత్యలు చేసుకునేది కౌలు రైతులే అని ఆయన అన్నారు. బుద్ది ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా కౌలు రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

వచ్చే 12 నెలల్లో తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే రైతు సమస్యలపై పోరాటం చేసేందుకు త్వరలోనే రాహుల్ గాంధీ తెలంగానకు వస్తారని ఆయన అన్నారు. ధాన్యాన్ని ఎవరూ తక్కవ ధరకు అమ్ముకోవద్దని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించిన ప్రతీ పంటను గిట్టుబాటు ధరకు కొంటుందని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news