ఎన్నికల ఫలితాల తరువాత BRS భూస్థాపితం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

ఎన్నికల ఫలితాల తరువాత BRS భూస్థాపితం అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్‌ పేల్చారు. ఇవాళ మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు..ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు.

komatireddy about police innovas

మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం తప్పా.! అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినం అని కేటీఆర్ అంటున్నాడు..మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయావని ప్రశ్నించారు. మీ అయ్యా ఫామ్ హౌజ్ లో పడుకుంటే నువ్వే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఫలించినవు.

అధికారం చేపట్టగానే న్యాయచిక్కులని తొలగించి ఉద్యోగ భర్తీ చేపట్టినట్లు వివరించారు. దుర్గం చెరువు మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అది ఇది చేశామని చెప్తున్నాడు..పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. చంద్రబాబు అంతో ఇంతో హైటెక్ సిటీ కడితే.. కాంగ్రెస్ పరిశ్రమలు తెచ్చిందన్నారు. పరిశ్రమలు పోతున్నాయని జ్ఞానం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news