కేసీఆర్, కేటీఆర్ లకు కూన శ్రీశైలం గౌడ్ సవాల్..సిగ్గు, లజ్జా ఉంటే..!

-

కేసీఆర్, కేటీఆర్ లకు కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సవాల్ చేశారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం పడితే… రోజులు తరబడి గల్లీల్లో తిరగలేని పరిస్థితి ఉందని.. కుత్భుల్లాపూర్ కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ కు ఊడిగం చేసినోడు ఎమ్మెల్సీ గా ఉన్నాడని.. నరేంద్రమోదీ, బండి సంజయ్, బీజేపీ పై విమర్శలు చేయడం తప్ప, వాళ్లకు తెలిసింది ఏమీ లేదని విమర్శలు చేశారు.

బిడ్డా వివేక్… బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తే… ప్రజలు నీ తాట తీస్తారని.. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహించారు. 168 సర్వే నెంబర్ లో పేదలకు రిజిస్ట్రేషన్ చేయించని దద్దమ్మ స్థానిక ఎమ్మెల్యే అని… ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. జగద్గిరిగుట్ట లో బస్ డిపో కట్టిస్తా అని 5 ఏళ్ళు గడిచినా… ఇంకా దాన్ని కట్టలేదని.. సిగ్గు, లజ్జా ఉంటే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పైర్‌ అయ్యారు. Trs హామీలు గాలిలో… నీటి మూటలేనని… ఈ ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని విమర్శలు చేశారు. ఈ ప్రాంత సమస్యలపై బండి సంజయ్ గారికి వివరించానని పేర్కొన్నారు కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news