బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ…ఒంటిచేత్తో ఢీకొట్టే.. D టీమ్ BRS- కేటీఆర్‌

-

బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘మా తొమ్మిదేళ్ల పాలన…. వెలుగుల ప్రస్థానం. గత కాంగ్రెస్ పదేళ్ల పాలన… చీకటి అధ్యాయం. కారు స్టీరింగ్ KCR చేతిలో పదిలం కానీ కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పింది. బీఆర్ఎస్ ను విస్తరిస్తే అంత వణుకెందుకు. జాతీయ రాజకీయాలు మీ జాగీరా అని ఆగ్రహించారు కేటీఆర్.

దేశానికి దొరికిన వజ్రాయుధం…BRS’ అని ట్వీట్ చేశారు.మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..మీదే భారత రాబందుల పార్టీ అంటూ ఫైర్‌ అయ్యారు. ఏఐసీసీ అంటేనే…అఖిల భారత కరప్షన్ కమిటీ అని మండిపడ్డారు. దేశంలో…అవినీతికి, అసమర్థతకు.. ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ అని మండిపడ్డారు. స్కాములే తాచుపాములై.. మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదని విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్‌.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news