నేడు హనుమకొండలో మంత్రి కేటీఅర్ పర్యటన

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖళ మంత్రి కేటీఆర్ ఇవాళ హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఉదయం 10 నుంచి 11.25 గంటల వరకు రూ.33.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.35 గంటలకు డిపో గ్రౌండ్‌లో భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ నం, 2.30 గంటలకు హుస్నాబాద్‌ నుంచి హనుమకొండ పర్యటనకు వెళ్తారు.

హనుమకొండలో రూ.181 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.5.20 కోట్లతో నిర్మించిన మాడల్‌ వైకుంఠధామం, సైన్స్‌ పార్‌లను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్‌ సైన్స్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ భవనానికి శ్రీకారం చుడతారు. రూ.128 కోట్లతో 17 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హసన్‌పర్తి కిట్స్‌ కాలేజీలో ఇన్నోవేషన్‌ హబ్‌ను, సాయంత్రం 4.30 గంటలకు హనుమకొండలో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి కాజిపేటలో బహిరంగ సభలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news