తెలంగాణలో పెట్టుబడులపై రేపు కేటీఆర్‌ కీలక ప్రకటన..!

-

తెలంగాణలో పెట్టుబడులపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ రేపు ఉదయం కీలక ప్రకటన చేయనున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు..ప్రజలందరూ తప్పకుండా చూడాలని మంత్రి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.. రాష్ర్టానికి కీలకమైన పెట్టుబడుల అంశంలో రేపు ఉదయం 11.30 గంటలకు ప్రకటన చేయనున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో రేపు మరో కొత్త శకం మొదలుకానుందని తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి..చాలా టెక్‌ కంపెనీలు ఇప్పటికే కార్యాకలపాలు మొదలు పెట్టాయి..హైదరాబాద్‌ సహా నల్గొండ, వరంగల్,కరీంనగర్‌లో టెక్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి మంత్రి చాలా చొరవ చూపించారు..తాజాగా ప్ర‌పంచంలోనే అతిపెద్దదైన వ‌న్‌ప్ల‌స్ స్టోర్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నానన్నారు. వ‌న్‌ప్ల‌స్ ఇండియా టీమ్‌కు మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. త్వ‌ర‌లోనే వ‌న్‌ప్ల‌స్ స్టోర్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news