కొప్పుల ఈశ్వర్ గెలుపుపై కేటీఆర్‌ సంచలన ప్రకటన

-

కొప్పుల ఈశ్వర్ గెలుపుపై కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ గారి ప్రస్థానం కచ్చితంగా స్ఫూర్తిదాయకమని.. సింగరేణి కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్ర మంత్రి దాకా ఒక్కో మెట్టు ఎదిగిన తీరును రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

KTR on koppula eshwar

80 వ దశకం చివరలో సాధారణ సింగరేణి కార్మికుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన… క్రమంగా కార్మిక సంఘ నాయకుడిగా ఎదిగారన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. కార్మిక నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేశారు.

సింగరేణి కార్మికులకు ఆయన ఎనలేని మేలు చేశారని వివరించారు. ఆ తర్వాత 90 వ దశకం చివర్లో ప్రజా జీవితంలో చేరారు. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో 2001 లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు….2004 లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. పెద్దపల్లి ప్రజలు ఆయనను ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిస్తున్నానని కేటీఆర్‌ వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news