ఈటెల రాజేందర్ పై మండిపడుతున్న నేతలు

-

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఈటెలను నమ్ముకొని బీజేపీలోకి వస్తే తన దారి తాను చూసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకొని తాను పదవి తెచ్చుకున్నాడని.. మరి మమ్మల్ని కనీసం పట్టించుకోలేదని ఆవేదనలో ఉన్నారు ఆయన సహచరులు. ఈటెలను నమ్ముకుంటే ఇక తమ పరిస్థితి అంతేనని.. తమ దారి తాము చూసుకునే ఆలోచనలో ఉన్నారు.

ఇప్పటికే ఈటెలకు అత్యంత సన్నిహితుడైన ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారతాడని జోరుగా ప్రచారం సాగుతుంది. గత నాలుగు రోజులుగా ఈటెలకు దూరంగా ఉంటున్న ఏనుగు రవీందర్ రెడ్డి.. తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బిజెపికి గుడ్ బై యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఇక ఆయన బాటలోనే మరి కొంతమంది బిజెపి నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news