సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన మాదిగ సంఘాల నేతలు

-

మాదిగ సంఘాల ఫ్రంట్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మాదిగ కార్పొరేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా వారికి సీఎం భరోసా ఇచ్చారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన ఆయన కాంగ్రెస్ సర్కార్పై తరచూ విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఆ సామాజిక సంఘాల నేతలు సీఎంను స్వయంగా కలిసి థాంక్స్ చెప్పడం ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news