పేదల భూములను మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం – భట్టి

-

పేదల భూములను మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామన్నారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. మహేశ్వరం నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇల్లు ఇవ్వకపోగా.. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందన్నారు.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క

రాజహింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నామన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాటి చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇల్లను కూల్చివేస్తూ రాజధాని నడిబొడ్డున రాజహింస, భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుందన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్దంగా, మౌనంగా, కనిపించకుండా ప్రభుత్వం రాజ్య హింస చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news