ఎర్రబెల్లి దయాకర్ రావు: 1200 మంది మరణానికి కారణం కాంగ్రెస్సే !

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రము కోసం ప్రాణాలు ధారబోసిన అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాల గురించి హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన హామీలకు కౌంటర్ లు ఇచ్చారు. ఆ రోజు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని త్యాగం చేసినప్పుడు పాలనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే… అప్పుడే మీరు తెలంగాణను ఇచ్చి ఉంటే ఇంతమంది ఉద్యమాలు చేసి చనిపోయే అవసరం ఉండేది కాదన్నారు. అప్పుడు ఇష్టం వచ్చినట్లు వయ్వహారిచి ఇప్పుడు స్వార్థం కోసం వారి త్యాగాలను వాడుకోవడానికి పస లేని హామీలను ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.

1200 మంది చావులకు మీరే కారణమైతే మళ్ళీ వారి కోసం పెన్షన్ లు ఇస్తామనడం సమంజసం కాదు అంటూ మంత్రి ఎర్రబెల్లి కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. అంతే కాకుండా ముందు కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలలో రూ. 3 వేలు ఫించను లు ఇవ్వండి అంటూ సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news