రుణమాఫీ కానీ వారికి గుడ్ న్యూస్.. త్వరలోనే మాఫీ : మంత్రి ఉత్తమ్ కుమార్

-

రుణమాఫీ కానీ వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎర్రమంజిల్ లోని జలసౌదలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. 2014 తరువాత బీజేపీ ఎప్పుడూ రుణమాఫీ గురించి మాట్లాడలేదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఆ పార్టీ రైతుల కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదన్నారు. రైతులను రుణవిముక్తులను చేయాలని తాము సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

సాంకేతిక కారణంగా కొందరికీ రుణమాఫీ జరగలేదని.. వారికి కూడా 100 శాతం రుణమాఫీ చేస్తామని హామీ
ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. 1.20లక్షల మంది రైతుల ఖాతాలకు ఆధార్ నెంబర్లు సరిగ్గా లేవని.. అందుకే వారికి రుణమాఫీ జరుగలేదని తెలిపారు. రుణమాఫీ కానీ రైతుల వివరాలను తీసుకొని పోర్టల్ లో అప్ లోడ్ చేస్తే.. రుణమాఫీ చేస్తామని హామి ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారులు ఈ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ రైతుకు ఈ ప్రభుత్వం కచ్చితంగా రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news