ఎల్ఆర్ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలి : హరీశ్ రావు

-

ఎల్ఆర్ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.  నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం అన్నారు హరీశ్ రావు.

ప్రధానంగా  అధికారులకు టార్గెట్ లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురి చేయడం దారుణం అన్నారు.  ప్రజలు ఎల్ఆర్ఎస్ కోసం ఒక్క రూపాయి కట్టొద్దు.  ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం ఎల్ఆర్ఎస్ మాత్రమే కాదు.. ఈ మధ్య కాలంలో ఏ రంగం చూసినా భ్రష్టు పట్టిస్తున్నారు. వైద్య రంగం విషయంలో అయితే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే సాక్ష్యం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news