క్షీణిస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం.. ఆందోళనలో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు

-

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గత నాలుగు రోజుల నుండి ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉదృతం అవుతున్నాయి.

గత నాలుగు రోజులుగా మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో ఆయన ఆరోగ్యం గంట గంటకు విషమిస్తోంది. దీంతో డాక్టర్లు గంట గంటకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news