కేసీఆర్‌, కేటీఆర్‌ ను తిట్టిన వాళ్లు మట్టి కొట్టుకుపోతారు – మల్లారెడ్డి

-

కేసీఆర్‌, కేటీఆర్‌ ను తిట్టిన వాళ్లు మట్టి కొట్టుకుపోతారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సీరియస్‌ అయ్యారు. బీజేపీ..కాంగ్రెస్ అధ్యక్షులు కేసీఆర్.. కేటీఆర్ ని తిడుతున్నారు మా ఉసురు కొట్టుకుని పోతారు వాళ్ళు అంటూ రెచ్చిపోయారు. కార్మికుల ఉసురు తగులుతుందన్నారు. హైదరాబాద్.. మరో ఆమెరికా అని… అమెరికా పాతదైపోయిందని చెప్పారు.

ఐటీ అంటే హైదరాబాద్ అని.. కేటీఆర్ చలువతో ఐటీ హబ్ అయ్యిందని వెల్లడించారు. హైదరాబాద్ కార్మికులకు మంచి రోజులు వస్తాయని వివరించారు. మన నోరు కొట్టి.. మోడీ ఆధానికి పెడుతున్నారని.. మోడీ లేకముందు ఆధాని ఆస్తి ఎంత అని ప్రశ్నించారు. ఆధాని ఆస్తి 85 లక్షల కోట్లు అని.. దేవుడు ఉన్నాడు..ఒక్కడికె దోచిపెడుతున్నాడు..మోడీ పాపం పండుతుందని అంటూ ఫైర్‌ అయ్యారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news