తెలంగాణలో కొత్త అధ్యాయానికి మా బ్లూప్రింట్ సిద్ధం: ఖర్గే

-

కాంగ్రెస్ ఖమ్మం సభపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. జనగర్జన ద్వారా రాహుల్ గాంధీ ప్రజల ఆకాంక్షలను వినిపిస్తారని చెప్పారు. 1,360 కి.మీ.ల పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు ఖర్గే అభినందనలు తెలిపారు. కీలక నేతల చేరికలతో కాంగ్రెస్‌ బలోపేతం అవుతోందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో సమష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్‌ పార్టీ గర్విస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి తమ బ్లూ ప్రింట్ సిద్దమైందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా తెలంగాణ అభివృద్ది, పురోగతికి తాము కట్టబడి ఉన్నామని ఖర్గే ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

మరోవైపు ఇవాళ ఖమ్మం నగరంలో జరగనున్న కాంగ్రెస్ జనగర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి హస్తం కార్యకర్తలు ఖమ్మం నగరం తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ అడ్డుకుంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news