హైదరాబాద్ వాసులకు శుభవార్త..ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో పొడిగింపు

-

హైదరాబాద్ వాసులకు శుభవార్త తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. భారీగా ట్రాఫిక్‌ ఉండేటు వంటి ఎల్బీ నగర్‌ ప్రాంతం నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో పొడిగిస్తామని సంచలన ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్‌.

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఎల్.బీ. నగర్ కామినేని జంక్షన్ వద్ద వారి విగ్రహానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.

నాగోల్‌ – ఎల్బీనగర్‌ లైన్‌ను కూడా అనుసంధానం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు కేటీఆర్‌. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్‌ పూర్తి చేస్తాం.. మళ్లీ వచ్చేది టీఆర్ఎస్‌ ప్రభుత్వమేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు మంత్రి కేటీఆర్. ఎవరెన్ని చెప్పినా.. కేసీఆర్‌ మరోసారి సీఎం అవుతారని చెప్పారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news