మున్నూరు కాపులు ఎల్లప్పుడూ కేసీఆర్ వెన్నంటే ఉంటారు: గంగుల కమలాకర్

-

తెలంగాణ రాకముందు మున్నూరు కాపులను రాజకీయంగా వాడుకున్నారని, బీసీల్లో అధిక శాతం ఉన్న మున్నూరు కాపులకు సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చి గౌరవించడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర కు అవకాశం ఇచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడారు. కుల సంఘం సమావేశం పెట్టడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు అని, అయితే తన కులాన్ని ముందు తాను గౌరవిస్తానని చెప్పారు.

అన్ని పార్టీలు గుర్తించాలంటే కుల సంఘాలు పటిష్టంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో బీసీలకు నాలుగు మంత్రిత్వశాఖలు కేటాయించారని, హైదరాబాద్ మహానగరంలో మున్నూరు కాపులకు రెండుసార్లు మేయర్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే కోకాపేటలో కోట్ల విలువైన స్థలం మున్నూరు కాపు భవనానికి ఇచ్చారని, మున్నూరు కాపులు ఎల్లప్పుడూ కేసీఆర్ వెన్నంటే ఉంటారని పేర్కొన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Read more RELATED
Recommended to you

Latest news