ఆగస్టు చివరలో కొత్త రేషన్‌ కార్డులు, పెన్షన్లు – మంత్రి హరీష్‌ రావు

-

ఆగస్టు చివరలో కొత్త రేషన్‌ కార్డులు, పెన్షన్లు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులపై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు చివరి వారంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, కార్డులు ఇచ్చేందుకు అంతా సిద్ధమైందని తెలిపారు.

ration-cards
ration-cards

ఆగస్టు చివరి వారంలో కొత్త పెన్షన్లు కూడా వచ్చేలా చూస్తామని చెప్పారు. మరోవైపు 2014 నుంచి రద్దయిన 21 లక్షల రేషన్ కార్డుల్లో తిరిగి అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు..రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేయడంతో.. పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news