కేటీఆర్ మానసిక స్థితి బాగోలేదని అనిపిస్తుంది : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

దేశ ఐక్యత కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆయన దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నారు. ఇక తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ కొందరు పనికి రాని వాళ్ళు.. విగ్రహా ఏర్పాటు పై మాట్లాడుతున్నారు. పెట్రోల్ దొరికింది కని అగ్గిపెట్టే దొరకలేదని ఒక వ్యక్తి… ఆసుపత్రిలో దొంగ దీక్ష చేసిన వ్యక్తి మరొకరు మాట్లాడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని వ్యక్తులు కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో దోపిడీ కుటుంబానికి ఆ అర్హత లేదు. కేటీఆర్ నీ మానసిక స్థితి బాగోలేదని అనిపిస్తుంది అని పేర్కొన కోమటిరెడ్డి.. ఈ దొంగ కుటుంబం కాంగ్రెస్ మీద చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి అని పేర్కొన్నారు. అయితే ఈ రోజే సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news