అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుంది..!

-

అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుంది అని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రుణమాఫీ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతుల నమ్మకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల సాంకేతిక లోపాల వల్ల, మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రైతులకు రుణమాఫీ అందలేదని వాటన్నిటిని సవరించి పూర్తిస్థాయిలో రుణమాఫీ అందజేస్తాం. కాబట్టి రైతులు నిరాశ చెందవద్దు అని భరోసా ఇచ్చారు.

అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాతాళ లోకంలో పడదేసింది. బీఆర్ఎస్ నేతలు కొన్నిచోట్ల రైతుల ముసుగులో రుణమాఫీ ఆందోళనలు పాల్పడుతున్నారని వారికి రైతులే తగిన బుద్ధి చెప్పాలి. రుణమాఫీ ఫై తోడు దొంగలైన కేటీఆర్, హరీష్ రావులు అబద్దాలతో పోటీపడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. అలాగే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.

Read more RELATED
Recommended to you

Latest news