ఎమ్మెల్యే మాట.. గంగ‌వ్వదే ఆట..!

-

తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ నాలుగవ సీజన్ కూడా మొదలైంది. సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షో లో మొత్త 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంట్రీ ఇచ్చారు. అలాగే బిగ్ బాస్ స్టేజ్‌పై కింగ్ నాగార్జున.. హౌస్‌లో ముసలి నాగార్జున తెగ సందడి చేశారు. ఇకపోతే బిగ్‌బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 16 మంది కంటెస్టెంట్స్‌ లో గంగ‌వ్వ ఒక‌రు. మై విలేజ్ షో ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన గంగ‌వ్వ తెలంగాణ యాస‌లో దుమ్ము దులు‌పుతుంది. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్‌ ని ఇంట‌ర్వ్యూ చేసి నేష‌న‌ల్ మీడియా దృష్టిని ఆక‌ర్షించింది.

గంగ‌వ్వ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతి నుంచి ఆమెకు ప్రేక్షక ఆదరణ మరింత పెరిగిపోయింది. తాజాగా.. చొప్పదంటి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సైతం గంగ‌వ్వకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేస్తూ..‘మా చొప్పదండి నియోజకవర్గ అవ్వ గంగవ్వ బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. మారుమూల పల్లె నుండి తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. గంగవ్వ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news