ఇచ్చిన మాట కోసం అడవినే దత్తత తీసుకున్న ప్రభాస్..!

-

టాలీవుడ్ హీరో ప్రభాస్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గర్లోని ఖాజీపల్లి అనే గ్రామానికి చెందిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను దత్తత తీసుకున్నారు. ఇటీవలే గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్ ఓ 1000 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ మేరకు ఖాజీపల్లి అర్బన్ బ్లాక్ ను దత్తత తీసుకున్నారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపిన ప్రభాస్.. త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేశాడు.‌ అలాగే భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రభాస్ ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కూడా హాజరయ్యారు. ఇకపోతే ప్ర‌స్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ప్రభాస్.. ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మ‌రో బిగ్ ప్రాజెక్ట్ లో  హీరోగా న‌టించ‌నున్నాడు. ఆ త‌ర్వాత బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ అనే భారీ సినిమాలో రాముడిగా ప్ర‌భాస్ న‌డించ‌నున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news