మిస్టర్ అరవింద్.. దాడి కాదు వీపు సాపు చేస్తాం – ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

-

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టీఆరెఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజేపి ఎంపి అరవింద్ ఇంట్లో మహిళలు లేరా..? ఒక మహిళ అయిన కల్వకుంట్ల కవితపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గు చేటుని మండిపడ్డారు.

నిన్ను కవిత చెప్పుతో కొడతా అంది కదా.. నిన్ను చెప్పుతో కొట్టాలంటే కవితక్క చెప్పు కూడా సిగ్గు పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపి గుండా గాళ్లు మా కవితక్క ఇంటికి వచ్చి దాడి చేసిన రోజు లెక్క పత్రం లేదా? అని మండిపడ్డారు. బిడ్డా దాడి కాదు ఈపు సాపు చేస్తాం గుర్తు పెట్టుకో మిస్టర్ అరవింద్.. జాగ్రత్తగా ఉండు! అని హెచ్చరించారు. నోరు దగ్గర పెట్టుకో.. కవిత గురించి, కేటీఆర్, కేసీఆర్ గురించి మాట్లాడితే నాలుక కోస్తామని వ్యాఖ్యానించారు. నువ్వు మోగోడివి అయితే రాజీనామా చేసి ఈ సారి మా కవిత మీద పోటీ చెయ్ అని సవాల్ విసిరారు. మత కల్లోలాలు లేపి తెలంగాణ రాష్ట్రాన్ని ఎమ్ చేద్దాం అనుకుంటురని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news