హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్ : వారం పాటు MMTS రైళ్లు రద్దు

-

హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్. వారం పాటు MMTS రైళ్లు రద్దు కానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 2 వరకు 22 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య MMTS రైళ్ళను నిలిపివేయనున్నారు.

ఈ మార్గాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. MMTS రైళ్లు రద్దు కానున్న తరుణంలో.. ప్రయాణికులు సహకరించాలని కోరారు రైల్వే అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news