తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యమనేత కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఉద్యమనేత కేసీఆర్.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను స్మరించుకున్నారు.

KCR sensational announcement against Revanth Reddy Sarkar

బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పిద్దామన్నారు. ప్రజాస్వామిక వాతావరణం లో పార్లమెంటరీ పంథాలో బిఆర్ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం భావజాలవ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సకలజనులకు బోధించి., పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించి, తెలంగాణకు సానుకూలంగా దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పించి, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news