లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటాదో పోతదో – అరవింద్ ధర్మపురి

-

బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖలు చేశారు. కేసీఆర్ 7000 కోట్ల రూపాయలు రైతుబంధు డబ్బులు ఉంచిపోతే అందులో పొంగులేటి 2000 కోట్లు, కోమటిరెడ్డి 3000 కోట్లు తీసుకున్నారు.. రేపు లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటాదో పోతదో అంటూ బాంబు పేల్చారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి.

mp aravind comments on congress

అటు మోడీ ఇచ్చే పథకాలు తీసుకుంటూ మోడీకి ఓటు వెయ్యకుంటే నరకానికి పోతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి.. అబద్ధపు హామీ లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని…కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. నిధులన్నీ నల్గొండ… ఖమ్మం జిల్లాలకే మళ్లీస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్‌ వైఖరి నిరసిస్తూ ఎంపీ ఎన్నికల తర్వాత కొడంగల్ లో దీక్ష చేస్తామని ప్రకటించారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news