తెలంగాణ రన్ కుసుమ జగదీష్ కు అంకితం-ఎంపీ సంతోష్ కుమార్

-

తెలంగాణ రన్ కుసుమ జగదీష్ కి అంకితం అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ అతిధిగా పాల్గొన్నారు ఎంపీ సంతోష్ కుమార్. అలాగే మంత్రి మల్లారెడ్డి,మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, స్థానిక బిఅరెస్ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సీఎం కేసీఆర్ వెంట నడిచిన ఉద్యమకారుడు,ములుగు జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ ని తలుచుకొని రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు ఎంపీ సంతోష్ కుమార్. కుసుమ జగదీష్ హఠాన్మరణం కలిచివేసిందని దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి,మేయర్ జక్కా వెంకట్ రెడ్డి,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,స్థానిక బిఅరెస్ నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news