Mudragada Padmanabham : జనసేన పార్టీలోకి ముద్రగడ ?

-

Mudragada Padmanabham : జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం వెళతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్న రాత్రి కాకినాడలో ముద్రగడ పద్మనాభంను కలిశారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించారు బొలిశెట్టి శ్రీనివాస్.

Mudragada Padmanabham into janasena
Mudragada Padmanabham into janasena

పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారట ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పారట ముద్రగడ. ఇక అతి త్వరలోనే జనసేనలోకి ముద్రగడ పద్మనాభం చేరే అవకాశము ఉందని సమాచారం అందుతోంది.. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే టిడిపి కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీ ఆసక్తికరంగా మారింది… కూటమిలో కలిసి పని చేయాలని నెహ్రూ పద్మనాభం ను కోరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news