యూట్యూబ్ మాజీ సీఈఓ మరణ వార్త విని చాలా బాధ పడ్డాను : కేటీఆర్

-

యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్ కికీ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. యాబై ఆరు ఏళ్ల ఆమె.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా ఈనెల 10న నిన్న మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గూగుల్ ఉద్యోగుల్లో ఒకరిగా నిలిచిన సుసాన్ 2014లో యూ ట్యూబ్ సీఈవో గా బాధ్యతలు చేపట్టారు.

అయితే సుసాస్ వోజ్ కికీ మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు కేటీఆర్. తన ట్వీట్ లో డైనమిక్ సుసాన్ వోజ్ కికీ, యూట్యూబ్ మాజీ సీఈవో మరణ వార్త విన్నందుకు చాలా బాధ పడ్డట్టు తెలిపారు. ఈ విషాద సందర్భంలో సుసాన్ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ప్రార్థిస్తున్నాను. అలాగే ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నానని రాసుకొస్తూ.. గతంలో సుసాన్ తో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు కేటీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news