నాగార్జున సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే జులై నెలలోనే 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం 18 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో.. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తూ, మరోవైపు ఫొటోలకు ఫోజులిస్తూ ఎంజాయ్ చేశారు.
మొత్తం 26 గేట్లలో 16 గేట్లు 5 అడుగుల మేరకు ఎత్తడం… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తు వరకు ఎత్తి దిగువకు నీటిని పంపిస్తున్నారు మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీ వరద రావడంతో 8 గేట్లను వదిలారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి నిన్న తొలుత 2 గేట్లు ఎత్తి మంత్రి ప్రారంభించారు. ఆ తరువాత ఒక్కోగేట్ ఎత్తి 26 గేట్ల వరకు ఎత్తారు. దీంతో 3,13,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. నాగార్జున సాగర్ నీటి నిలువ సామర్థ్యం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.60 అడుగుల ఎత్తు వరకు నీళ్లు ఉన్నాయి.