నాంపల్లి అగ్నిప్రమాదం ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

-

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగి, నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని కార్మికులు సజీవదహనం అయ్యారు. 6 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Nampally fire death toll rises to 9

అయితే.. హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అలాగే ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఆరుగురిని ఆసుపత్రికి తరలించారట. ఇక రంగంలో దిగిన 6 ఫైర్ ఇంజన్లు.. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news