తెలంగాణకు మోడీ అబ్బ సొత్తు ఇచ్చాడా ? -సిపిఐ నారాయణ ఫైర్

-

తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ చెప్తున్నారు.. తెలంగాణకు ఆయన అబ్బ సొత్తు ఇచ్చాడా? అని ఫైర్ అయ్యారు సీపీఐ నారాయణ. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వే ని ఆధునికరిస్తున్నారు…ఆ తరువాత అవి అమ్మేస్తారు అని మండిపడ్డారు.

బిఎస్ఎన్ఎల్ నిలబెట్టడానికి 30 వేల కోట్లు ఇస్తే సరిపోయేది… కానీ ప్రైవేట్ కంపెనీకి 30 వేల కోట్లు ఇచ్చి బిఎస్ఎన్ఎల్ ని దెబ్బతీశారు మోడీ అని ఆగ్రహించారు. మోడీ తన డిగ్రీ విషయంలో అబద్ధాలు చెప్పడం ఆయన అనైతికతకు నిదర్శనం… డిగ్రీ లేకున్నా ప్రధానమంత్రి కావచ్చు..తప్పేముందన్నారు. ఆధాని వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యంతో అదానికే లబ్ధి చేకురింది…మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు… మోడీ ఊపిరి అంతా ఆదాని చేతిలో ఉందని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news