రాహుల్ ఎక్కడ పోటీ చేసినా 4 లక్షల మెజార్టీ తెచ్చే బాధ్యత మాదే : కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని టీపీసీసీ నుండి ప్రపోజల్ పెట్టామని మంత్రులు కోమటిరెడ్డి తెలిపారు. సెక్రటేరియట్ లో కోమటిరెడ్డి ఇవాళ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని తెలంగాణలోని నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేయాలని కోరామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆ రెండు చోట్ల ఎక్కడ పోటీ చేసిన నాలుగు లక్షలకు పైగా మెజారిటీ వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీజేపీనే.. బీఆర్ఎస్ పోటీనే కాదని తేల్చి చెప్పారు.

బీఆర్ఎస్ ఎలాగూ పోటీలో లేదని.. బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయేమో మాకైతే తెల్వదని అన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ తనకు రూ.2 వేల కోట్లు ఉన్నాయని అన్నాడని.. నా పేరుమీద ఎక్కడైనా అన్ని ఆస్తులు ఉంటే అరవింద్కు రాసి ఇస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. అరవిందు ప్రజలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి తాము ఆస్తులు సంపాదించలేదని.. ఉన్న ఆస్తులు పొగొట్టుకున్నామని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనవి, ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఆస్తులు తగ్గాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news