ఒకే చితిపై నాలుగు శవాలను కాలుస్తున్న అధికారులు

-

కరోనా సోకినా వారి విషయంలో… ఇప్పుడు కొందరు అనుసరిస్తున్న వైఖరి ఆందోళన కలిగిస్తుంది. అంత్యక్రియల విషయంలో ఆందోళనకరంగా కొందరి వ్యవహారశైలి ఉంది. ప్రజల్లో భయాలు ఉన్న సమయంలో కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు కొందరు. తాజాగా వరంగల్ జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే చితిపై నాలుగు శవాలను దహనం చేస్తున్నారు అధికారులు.

కరోనా మృతదేహాల కాల్చివేతలో నిబంధనలు, సంప్రదాయాలను అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు. ఒకే చితిపై నాలుగు మృతదేహాలు దహనం చేసారు. మూడు చితుల్లో 9మృతదేహాలను దహనం చేసారు. అసలు ప్రభుత్వం కరోనా మృతుల విషయంలో లెక్కలు ఒకరకంగా చెప్తుంటే వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news