కేసీఆర్‌ సర్కార్‌ ఓవైసీ వివాదస్పద వ్యాఖ్యలు..కారు స్టీరింగ్‌ అంటూ !

-

 

కేసీఆర్‌ సర్కార్‌, బీఆర్‌ఎస్‌ పార్టీపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ ఓవైసీ వివాదస్పద వ్యాఖ్యలు. కారు స్టీరింగ్‌ తన దగ్గర లేదని పేర్కొన్నారు ఓవైసీ. బీఆర్‌ఎస్‌ పైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ .. స్టీరింగ్ నా దగ్గర ఉందా.. బీఆర్‌ఎస్‌ పార్టీ.. అసలు నన్ను పట్టించుకోవట్లేదని ఆగ్రహించారు. నిజంగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ స్టీరింగ్ నా దగ్గరే ఉంటె దానికి సంబంధించి ఉదాహరణలు చెప్తానని పేర్కొన్నారు.

పాతబస్తీలో మెట్రో ఎందుకు రావట్లేదు… రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఎందుకు వేస్తున్నారని నిలదీశారు. శేరి లింగంపల్లి- పటాన్చెరు వరకు మెట్రో ఎందుకు పొడగించలేదని నిప్పులు చెరిగారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ ఓవైసీ. మైనార్టీలో ఉన్న below ప్రోవర్టీ వాళ్లకు దళిత బంధు కింద ఆర్థిక సహాయం చేయాలని అడిగాను.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్‌ అయ్యారు. స్టీరింగ్ ఎవరి దగ్గర ఉందో మీరు ఊహించుకోండని ఎద్దేవా చేశారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ ఓవైసీ.

Read more RELATED
Recommended to you

Latest news