ఉగాది వేడుకల్లో పవన్.. ఫోటోలు వైరల్

-

ఉగాది పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన పండుగలు అన్ని ప్రకృతితో పెనవేసుకున్నాయన్నారు. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా, ఆరోగ్యం, ఆనందంతో సిరిసంపదలు కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఉగాది జరుపుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగాది మన తెలుగువారికి ప్రీతిపాత్రమైన పండుగ. వసంతం అడుగుపెడుతూనే ఉగాదిని కుడా మోసుకురావడం విశిష్టదాయకం. ఉగాదితోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌. అందుకే ఉగాది మన తెలుగువారికి తొలి పండుగ అయింది.

సంక్రాంతినాటికి పంట చేతికి వస్తే.. ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. మన పండుగలన్నీ ప్రకృతితో పెనవేసుకున్నవే కావడం వల్ల అవి అంత శోభాయమానంగా వెల్లివిరుస్తాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నిష్క్రమిస్తూ శ్రీ శోభకృత్ ప్రవేశిస్తున్న ఈ శుభ ఘడియలలో తెలుగువారందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన ఉగాది శుభాకాంక్షలు చెప్పారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news