కొండగట్టునుండి వెళుతుండగా రోడ్డుపైనే ఆగిపోయిన పవన్ కళ్యాణ్ వాహనం

-

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో వారాహి ప్రచార రథానికి పూజలు చేశారు. అనంతరం జనసేన నేతలతో సమావేశమై తెలంగాణలో పోటీ చేసే అంశంపై చర్చించారు. అలాగే ఏపీలో పోతులపై కూడా స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.

అనంతరం కొండగట్టు నుండి తిరిగి వెళుతున్న పవన్ కళ్యాణ్ వాహనం నాచుపల్లి క్రాస్ రోడ్డు వద్ద పంచర్ అవడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. కారు పంచర్ కావడం వల్ల రోడ్డుపైనే పది నిమిషాల పాటు వేచి ఉన్నారు పవన్ కళ్యాణ్. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతగా కారుకి రక్షణ కల్పించారు. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. హుటా హుటిన సిబ్బంది టైర్ మార్చడంతో పవన్ కళ్యాణ్ అక్కడి నుండి బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news