నన్ను చంపాలని చూస్తున్నారు : పుట్ట మధు సంచలనం

-

జడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వాక్యాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తన్ను చంపాలని చూస్తున్నారని జడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వాక్యాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలలోపే తనను చంపాలని చూస్తున్నారని తెలిపారు.

Peddapally ZP Chairman Putta Madhu comments on congress

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఎస్ ఎల్ బి గార్డెన్స్ లో శుక్రవారం జరిగిన మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథనిలో ఒకే కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నోట్ల సంచులతో కోట్లు పంచి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని కానీ తాను చావుకు భయపడనని పుట్ట మధు స్పష్టం చేశారు. చచ్చే వరకు ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలబడతానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news