ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడొద్దు : సీఎం కేసీఆర్

-

ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడొద్దు అని సీఎం కేసీఆర్ కోరారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి. ప్రజాస్వామ్యం గెలవాలి. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు కేసీఆర్. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అని సీఎం కేసీఆర్ తెలిపారు.

సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే.. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని నిరహార దీక్ష చేసి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. సింగరేణిని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. రైతు మేలు కోసమే ధరణినీ తీసుకొచ్చామని తెలిపారు సీఎం కేసీఆర్. రాహుల్ గాంధీ ధరణీని తీసేస్తా అంటున్నారు. ధరణీని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news