భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు – సీఎం కేసీఆర్‌

-

భద్రాచలం ముంపు బాధితులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. ఇవాళ సీఎం కేసీఆర్‌.. భద్రాచలం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గోదావరి నీళ్లకు శాంతి పూజ చేశారు సీఎం కేసీఆర్‌. అనంతరం.. ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ… భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ప్రకటన చేశారు.

గతంలో కంటే.. కనివినీ ఎరుగని వరదలు వస్తున్నాయని.. 50 అడుగులు గోదావరి వచ్చిన కొన్ని ప్రాంతాలు మునుగుతున్నాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. కాబట్టి ముంపు బాధితులకు కోసం.. ఎత్తైన ప్రాంతాలను చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి అధికారులు వస్తారని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. భద్రాచలం లో ఎలాంటి ప్రాణ హాని జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news