PIL in High Court to continue Hyderabad : హైదరాబాద్ పై ఏపీ వాసులు కుట్రలు పన్నుతున్నారు. తాజాగా హైదరాబాద్ను మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.హైదరాబాద్ను ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు కొనసాగించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విచారణ చేయనుంది.
![Kottakota Srinivasa Reddy as Hyderabad CP](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/12/1568995-hyd.webp)
కాగా, గతంలో వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన అంశానికి తెరలేపారు. హైదరాబాద్ను ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్య సభలోనూ దీనిపై చర్చిస్తామన్నారు.