తెలంగాణలో బీజేపీ పెరుగుతోంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తగ్గుతోంది : మోదీ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ జగిత్యాల పట్టణానికి చేరుకున్న ఆయన అక్కడ నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సభలో మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిందన్న ఆయన.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య ఉత్సవం ప్రారంభమైందని తెలిపారు. దేశం అభివృద్ధి చెందితేనే.. తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

‘దేశం అభివృద్ధి చెందితేనే.. తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. గత మూడు రోజుల్లో నేను తెలంగాణకు రావడం ఇది రెండోసారి. తెలంగాణ కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. తెలంగాణలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవల శ్రీకారం చుట్టాం. తెలంగాణ నలుమూలల నుంచి బీజేపీకి మద్దతు పెరుగుతోంది. మాల్కాజ్‌గిరిలోని బీజేపీ ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణలో బీజేపీ పెరుగుతోంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తగ్గుతోంది. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారు. భారత్‌, తెలంగాణ వికాసం కోసం ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలి.’ అని ప్రధాని మోదీ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news