వచ్చే వారంలో పిఠా పురంకు పవన్ కళ్యాణ్‌

-

వచ్చే వారంలో కాకినాడలోని పిఠా పురం నియోజక వర్గంకు పవన్ కళ్యాణ్‌ వెళ్లనున్నారు. పిఠా పురం నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు పవన్‌ కళ్యాణ్‌. పిఠా పురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారు.

ఇక పవన్ పర్యటన లోనే పార్టీలోకి చేరికలు ఉంటాయి. ఈ సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్ లో ఉన్న పనులు పై దృష్టి పెడతారు. గ్రామాల వారీగా ప్రచారము పై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వం కి సూచనలు చేస్తారు పవన్‌ కళ్యాణ్‌. తరువాత పర్యటనలో కూటమిలో మూడు పార్టీల నేతలు కార్యకర్తలతో మీటింగ్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news