BREAKING: కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

-

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

CM Revanth Reddy residence is Brush Melle Pocharam Srinivas Reddy

ఇక ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పదేళ్లు పూర్తి అయింది….రేవంత్ నాయకత్వం లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిందన్నారు. రేవంత్ ని నేనే ఇంటికి ఆహ్వానించానని… రైతు పక్షపాత నిర్ణయం తీసుకుంటున్నారని కొనియాడారు. రైతుల కష్టాలు తీరాలని.. కాంగ్రెస్ లోకి వచ్చానని ప్రకటించారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. ఆరు నెలల పాలన చూశామని…. చిన్న వయసులోనే అన్ని సమస్యలు అవగాహన చేసుకుంటున్నారని ప్రశంసించారు.రాజకీయంగా నేను ఏం ఆశించడం లేదన్నారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news