రాహుల్ గాంధీని కలిసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

-

Pocharam Srinivas Reddy: రాహుల్ గాంధీని కలిసారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిన్న సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి…ఢిల్లీకి వెళ్లారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కలిసారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అటు మల్లిఖర్జున ఖర్గేను కలిసారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.

Pocharam Srinivas Reddy who went to Delhi and met Rahul Gandhi

ఇది ఇలా ఉండగా, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక, ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయమై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయంచినట్లు సమాచారం.దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ వెళ్లారు. జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news