BREAKING : సికింద్రాబాద్‌ లో ఉద్రిక్తత..ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు

-

BREAKING : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ ఉదయం పూట.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో ఆందోళనకు దిగారు ఆర్మీ అభ్యర్థులు. ఈ నేపథ్యంలోనే..సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లోని కొన్ని రైళ్లకు నిప్పు అంటించారు.

దీంతో రైల్వే స్టేషన్‌ లో పరిస్థితి ఉద్రిక్తతంగా మారిపోయింది. అయితే.. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో పరిస్థితి అదుపు తప్పింది. ఇక చేసేది ఏమీ లేక.. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు.. గాల్లో కాల్పులు జరుపుతున్నారు పోలీసులు. ఈ కాల్పుల్లో.. కొంత మంది ఆందోళన కారులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news