డైరెక్టర్ తేజ సెంటిమెంట్..‘జయం’ సినిమాకు గోపీచంద్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతనా!

-

ఫేమస్ టాలీవుడ్ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడు గోపీచంద్..‘తొలివలుపు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, తర్వాత కాలంలో మ్యాచ్ స్టార్ గా గోపీచంద్ ఎదిగాడు. కాగా, కెరీర్ తొలినాళ్లలో గోపీచంద్ విలన్ రోల్స్ ప్లే చేశాడు. వాటికీ మంచి పేరు వచ్చింది.

తేజ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘జయం’లో గోపీచంద్ విలన్ గా నటించారు. ఆ తర్వాత ‘నిజం’,‘వర్షం’ సినిమాల్లోనూ గోపీచంద్ ప్రతి కథానాయకుడి పాత్రలు పోషించాడు. అయితే, ‘జయం’ ఫిల్మ్ లో నితిన్ కు ఎంత పేరు వచ్చిందో..అంతకు మించిన పేరు గోపీచంద్ కు వచ్చింది.

గోపీచంద్ ..తర్వాత కాలంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’ వచ్చే నెల 1న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ‘జయం’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ..తన సంపాదన ‘జయం’ సినిమా రెమ్యునరేషన్ తోనే స్టార్ట్ అయిందని గుర్తు చేసుకున్నాడు. డైరెక్టర్ తేజ తన సెంటిమెంట్ ప్రకారం..తన లక్కీ నెంబర్ 11 అయిన నేపథ్యంలో..తనకు రూ.11 వేలు రెమ్యునరేషన్ ఇచ్చాడని తెలిపాడు. ఇక ఆ తర్వాత చాలా మంద తన వద్ద డబ్బులు తీసుకున్నారని తెలిపాడు గోపీచంద్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ డెఫినెట్ గా హిట్ అవుతుందని గోపీచంద్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news